డిసెంబరు 7వ తేదీన మాండ్యా జిల్లాలో రోడ్డు పక్కన అదుపు తప్పి గుంతలో పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నాగమంగళ తాలూకాలోని నాగతిహళ్లి సమీపంలో బెంగళూరు-మంగళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా వీరిని చిక్కమగళూరుకు చెందిన చంద్రేగౌడ్ (64), సరోజమ్మ (57), జయమ్మ (70)గా గుర్తించారు.

సంఘటనా స్థలాన్ని బిండిగన్‌విల్లే పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.