ఈ ఏడాది చివర్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన పేర్లలో పట్టభద్రుల నియోజకవర్గానికి రెండు పేర్లు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి మూడు పేర్లు ఉన్నాయి. లక్నో గ్రాడ్యుయేట్ స్థానానికి పార్టీ అవ్నీష్ కుమార్ సింగ్ను అభ్యర్థిగా నిలిపింది.
మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఆగ్రా గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. హరిసింగ్ ధిల్లాన్ బరేలీ-మొరాదాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి, ఉమేష్ ద్వివేది, శ్రీచంద్ శర్మ వరుసగా లక్నో, మీరట్ ఉపాధ్యాయ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.


